Ticker

6/recent/ticker-posts

VARSITY EDUCATION : వర్సిటీ... వీడిన మిస్టరీ !

  • సొసైటీల సొమ్మును ఇష్టారీతిన వర్సిటీకి మళ్ళిస్తున్న శ్రీచైతన్య ! 
  • సర్వీసు ధరను ఎక్కువ చూపటం, ఫేక్‌ ఇన్‌వాయిస్‌లతో తతంగం నడిపిస్తున్న శ్రీచైతన్య ! 
  •  వర్సిటీ నుండి ఇతర షెల్‌ కంపెనీల్లో పెట్టుబడులు !
  • ఇన్‌కంటాక్స్‌ అధికారుల నజర్‌ ! 
  • వర్సిటీ అక్రమాలపై EDకి ఫిర్యాదులు !

వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ శ్రీచైతన్య విద్యాసంస్థలకు (ట్రస్ట్‌/సొసైటీలు) సంబంధించిన ఒక సర్వీస్‌ ఏజెన్సీ. ఒక సర్వీస్‌ ఏజెన్సీ కేవలం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1969 కోట్లు లాభాన్ని ఆర్జించింది. ఒక సర్వీస్‌ ఏజెన్సీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తుంది అంటే తెర వెనుక పెద్ద తతంగమే నడుసున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక సొసైటీ/ ట్రస్ట్‌లో కేవలం 10% మాత్రమే తన సేవలకు గాను సర్వీసు ఛార్జ్‌ క్రింద బిల్లు చెల్లిస్తుంది. కానీ సర్వీసు క్రింద రూ. 1969 కోట్లు  చెల్లించింది అంటే శ్రీచైతన్య విద్యాసంస్థల టర్నోవర్‌ రూ. 19690 కోట్లు ఉండి ఉండాలి. కానీ శ్రీచైతన్య విద్యాసంస్థల క్రింద ఉన్న సొసైటీ/ ట్రస్ట్‌ల మొత్తం టర్నోవర్‌ దాదాపు 6300 కోట్లు. దానిలో 33% వరకు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌లోకి వస్తుంది అంటే ఎన్ని అవకతవకలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతుంది.

వర్సిటీలో వర్సీటీ వాటా నామమాత్రమే !

అసలు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి 16502002 షేర్స్‌ ఉంటే మెజార్టీ వాటా 14755584 షేర్లు కోయిస్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ఎల్‌.ఎల్‌.పి. అనే సంస్థకు చెందినదే. దీని నిర్వాహకులు బొప్పన సుష్మ, బొప్పన సీమ. వీరిద్దరూ వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.కి చెందిన డైరెక్టర్సే. అంటే వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.కి దాదాపు 88% వాటా కోయిస్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ఎల్‌.ఎల్‌.పి.దే. 19`10`2022 వ తేదీన షేర్‌ల బైబ్యాక్‌ పేరుతో  రూ. 5 ముఖ విలువ కలిగిన 11, 08, 976 షేర్లను  ఒక్కొ షేరుకు రూ. 1893.64 రూ. చెల్లించి రూ. 210000131/` కోయిస్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. అదే విధంగా 30`09`2024 న మరోసారి షేర్‌ల బైబ్యాక్‌ పేరుతో  రూ. 5 ముఖ విలువ కలిగిన 637428 షేర్లను  ఒక్కొ షేరుకు రూ. 3916.42 రూ. చెల్లించి రూ. 249,64, 35768 /` కోయిస్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. అంటే వర్సిటీ నుండి డబ్బును తమ మరో షెల్‌ కంపెనీ అయిన కోయిస్‌ ఎడ్యుకేషన్‌కి తరలించారు. ఈ లెక్కన వర్సిటీలో వర్సిటీ విలువ నామమాత్రమే. అదే సమయంలో కోయిస్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ఎల్‌.ఎల్‌.పి. రద్దు చేయబడిరది. 26`07`2023న ప్రై.లి. క్రిందకు మార్చారు.

రుణం తీసుకుని శ్రీవాల్మీకిని మింగేసిన వర్సిటీ !

వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కంపెనీ 8, జూలై 2021 బజాజ్‌ ఫైనాన్స్‌, పుణె నుండి 350 కోట్ల అప్పు,  21, జూన్‌ 2021 హీరో ఫిన్‌ కార్ప్‌, డిల్లీ నుండి 135 కోట్ల రుణం, 14, జూన్‌ 2021 టాటా క్యాపిటల్‌, ముంబాయి నుండి 335 కోట్ల రుణం పొందినట్లు పుస్తకాల్లో చూపించారు. ఇదే అప్పు శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. పేరు మీద ఒక నెల అటుఇటుగా ఎస్‌.ఆర్‌.ఎన్‌. మరియు ఛార్జ్‌ ఐడీల మార్పుతో 820 కోట్లు రుణం తీసుకున్నట్లు చూపించారు. ప్రైవేట్‌ పైనాన్స్‌ కంపెనీ అయిన టాటా క్యాపిటల్‌లో రూ. 335 కోట్ల రుణాన్ని ఒకే నంబరు మీద అటు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. లోనూ, ఇటు శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.లోనూ చూపించారు. అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో తీసుకున్న రుణం రూ. 150 కోట్లు శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్‌ పేరు మీద, రూ. 165.17 కోట్లు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ పేరు మీద తీసుకోగా ఈ రెండిరటి రుణాలను వర్సిటీలోనే చూపటం గమనార్హం. అలాగే హీరో ఫిన్‌ కార్ప్‌లో రూ. 135 కోట్ల రుణం శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్‌ పేరు మీద తీసుకుని వర్సిటీ ఎడ్యుకేషన్‌ బుక్స్‌లో చూపించారు. అప్పులన్నీ శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి పేరు మీద తీసుకుని ఆ అప్పులకు  వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి సెక్యూరిటీ ప్రొవైడర్‌గా ఉంది. అప్పులు తీసుకున్న కొన్నిరోజులకే శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కంపెనీని వర్సిటీ ఎడ్యుకేషన్‌ విలీనం చేసుకుంది. అప్పులు అనేవి వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ పేరు మీద రిజిస్టర్‌ కాకుండా క్లీన్‌గా ఉంచుకుని ఇతర చిన్న కంపెనీల పేరుతో అప్పులు తీసుకుని వెంటనే తనలో విలీనం చేసుకునేందుకు చాలా షెల్‌ కంపెనీలకు సిద్ధం చేసుకుంది. శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. నిర్వాహకులు ఎవరంటే డా॥బి.ఎస్‌.రావు, బి. రaాన్సీ లక్ష్మీభాయి కి చెందినది. వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. నిర్వాహకుల అమ్మా, నాన్నలదే.

క్విడ్‌ప్రో కో పాల్పడిన వర్సిటీ !

22, మే 2021లో శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. వివిధ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ కంపెనీల నుండి మొత్తంగా 1135.17 కోట్ల రుణం తీసుకుంది. ఆ అప్పుకు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి ష్యూరిటీగా షేర్లను తనఖా పెట్టింది. అనంతరం జూలై 16, 2021లో నియోపోలీస్‌ పేరుతో హెచ్‌ఎండిఏ నిర్వహించిన భూముల వేలంలో పాల్గొంది వర్సిటీ ఎడ్యుకేషన్‌. అంటే ఒక నెల ముందుగానే కోకాపేటలో భూముల అమ్మకం గురించి దానిని తెర వెనుక దక్కించుకునేందుకు వివిధ సంస్థల నుండి అప్పుల రూపంలో డబ్బు సమకూర్చుకుంది అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఫలానా వారికే భూములు దక్కేలా అధికారుల ద్వారా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ముందుగానే నిర్ణయించిన శ్రీచైతన్య యాజమాన్యానికి చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి కోకాపేటలో ఎకరం 42.2 కోట్లు చొప్పున 296.95 కోట్ల విలువైన  7.57 ఎకరాల భూమికి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. భూమిని దక్కించుకోవడానికి సహకరించినందుకు గాను ప్రభుత్వం నుండి ఆక్షన్‌కి సహాకరించినందుకు గాను దాదాపు 12 కోట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి విరాళాలు అందించి శ్రీచైతన్య క్విడ్‌ ప్రో కో పాల్పడినట్టు తెలుస్తోంది.  

వర్సిటీ షేర్ల సంఖ్య, విలువ పెంచకపోవడానికి కారణం !

వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి....శ్రీచైతన్య విద్యాసంస్థల ట్రస్ట్‌లు / సొసైటీలకు సంబంధించిన సొమ్మును తరలించేందుకు  ఓ వాహకంగా ఉపయోగపడుతున్న సర్వీస్‌ ఏజెన్సీ. 2010 సంవత్సరంలో నెలకొల్పిన ఈ సంస్థ పెయిడప్‌ క్యాపిటల్‌  ఇప్పటికీ 11, 19, 97060/` మాత్రమే, షేర్లు 16502002 మాత్రమే. గత దశాబ్దకాలంగా 100 కోట్ల లాభాలతో పాటు ఫ్రీ రిజర్వ్‌ల క్రింద వందల కోట్లు పోగుపడ్డాయి. కానీ పెయిడప్‌ క్యాపిటల్‌ను పెంచలేదు, అదే విధంగా షేర్ల సంఖ్యను, షేర్ల విలువ (రూ.5)ను పెంచలేదు. ఉదాహరణకు శ్రీచైతన్య యాజమాన్యం చేతిలో ఉన్న షెల్‌ కంపెనీలైన శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి మరియు అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్‌ ప్రై.లి. కంపెనీల్లోకి 19`06`2021 నుండి 10`07`2023 కేవలం 2 ఏళ్ళ వ్యవధిలో లక్ష రూపాయలు ఉన్న కంపెనీ ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌ను 4 దశల్లో పెంచుకుంటూ పోయింది. కంపెనీ ఆథరైడ్జ్‌ క్యాపిటల్‌ రూ. 600 కోట్లకు చేరింది. ఈ రెండు కంపెనీల్లో ఆథరైడ్జ్‌ క్యాపిటల్‌ పెరగటం ఒకేసారి జరిగింది. కానీ ఈ రెండు కంపెనీలకు నిధులు సమకూర్చింది మాత్రం వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. అప్పుల రూపంలో శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి. లోకి రూ. 600 కోట్లు తరలించి ఒక్కోషేరుకు రూ. 10 ముఖ విలువతో 60 కోట్ల షేర్లను విడుదల చేసింది. ఆ షేర్లలో మెజార్టీ భాగం వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ పొందింది. అలాగే అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్‌ ప్రై.లి. కంపెనీలోకి మరో రూ. 600 కోట్లు తరలించి ఒక్కోషేరుకు రూ. 10 ముఖ విలువతో 60 కోట్ల షేర్లను విడుదల చేసింది. ఆ షేర్లలో మెజార్టీ భాగం వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ దక్కించుకుంది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే వర్సిటీ పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో 10000 ఉన్న షేర్లు ఏకంగా 60 కోట్ల షేర్లకు చేరగా, ఎన్నో వందల కోట్లు ఉన్న వర్సిటీ తన పెయిడప్‌ క్యాపిటల్‌ను ఎందుకు పెంచలేక పోతుంది. షేర్ల సంఖ్యను, షేర్ల ముఖ విలువను ఎందుకు పెంచలేకపోతుంది అనే అంశంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి వర్సిటీ తన నల్లడబ్బును అధికారికంగా ఇతర షెల్‌ కంపెనీకు చేరవేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
SRI CHAITANYA : అవార్డులను కొనుక్కుంటున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?