హక్కులు తుంగలోకి తొక్కి..
కార్పొరేట్ కాలేజీలకు వేసవి సెలవులు లేవు’ అనేది తెలుగు రాష్ట్రాల్లో నానుడి ఉంది. బాలల హక్కుల గురించి, వారిపై పడుతున్న ఒత్తిడి గురించి ఆలోచించే వారు ఒక్కరంటే ఒక్కరు లేరంటే అతిశయోక్తి కాదు. కార్పొరేట్ కాలేజీలు వారి వ్యాపారం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చెప్పిందే వేదం అని కనీసం ఆలోచించలేని తల్లిదండ్రులు ఉన్నంత కాలం కార్పొరేట్ సంస్థల ఆటలు సాగుతూనే ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సెలవులు అనేది విద్యార్థులు మునుపటి నెలల్లో నేర్చుకున్న వాటిని రిఫ్రెష్ చేయడానికి కేటాయించబడిన సమయం, కానీ పిల్లలపై మళ్లీ విద్యావేత్తల భారం వేయకూడదు. ఇదిలా ఉండగా, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని జూనియర్ కాలేజీలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. కానీ ఏ అధికారి కార్పొరేట్ కాలేజీలపై చర్య తీసుకునేందుకు సాహసించటం లేదు. అందుకే కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలకు నడుపుతున్న పార్టీలకు ఫండ్స్ను అందిస్తూ అందిన కాడికి దండుకుంటున్నాయి.
0 Comments