Ticker

6/recent/ticker-posts

JEE MAIN FAKE RESULTS : జేఈఈ మెయిన్‌లో శ్రీచైతన్య ఫేక్‌ర్యాంకులు !

 

  • పర్సంటైల్‌ రాకున్నా వచ్చినట్టు బోగస్‌ ప్రకటనలు !
  • సోషల్‌ మీడియా వేదికగా దుష్‌ప్రచారం !
  • శ్రీచైతన్య జిమ్మిక్కులకు అవాక్కవుతున్న తల్లిదండ్రులు !

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవారం ఉదయం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా, వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించి రికార్డు సాధించారు. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీచైతన్య విద్యాసంస్థల నుండి ఒక్క విద్యార్థి మాత్రమే 100 పర్సంటైల్‌ సాధించాడు. అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డి విజయవాడ నుండి ఈ ఘతన సాధించాడు. అదే సమయంలో నారాయణ విద్యాసంస్థ  నుండి 8 మంది 100 పర్సంటైల్‌ సాధించిన వారు ఉన్నారు. దీంతో శ్రీచైతన్య తనదైన కనికట్టుకు తెరతీసింది. శ్రీచైతన్యకు సైతం 8 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించిన వారు ఉన్నారని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనతో తల్లిదండ్రులను , విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోంది.

నైతిక విలువలు పాటించని శ్రీచైతన్య !

గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్‌ సాధించిన 7 విద్యార్థులను  300ల మార్కులకు గాను 300 మార్కులు సాధించిన విద్యార్థులుగా చూపుతూ జేఈఈ మెయిన్‌లో శ్రీచైతన్యకు 8 మంది పర్సంటైల్‌ సాధించిన వారు ఉన్నారు అని శ్రీచైతన్య నిసిగ్గుగా ప్రకటించుకుంటోంది. తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. ఒక్క శ్రీచైతన్య నుండి దాదాపు 85000 లకు పైగా స్టూడెంట్స్‌ పరీక్షలో పాల్గొన్నారు. వీరిలో ఒక్కరంటే ఒక్కరికే 100 పర్సంటైల్‌ వచ్చింది. అంటే శ్రీచైతన్యలో చదువు ఏ పాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా తల్లిదండ్రులు, విద్యార్థులు కళ్ళు తెరుచుకుని శ్రీచైతన్య జిమ్మిక్కులను ఈ ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉంది.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా