ఉద్యోగాలు ఇస్తాం !
ఇళ్ల స్థలం ఇవ్వనున్నాం.. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణ మాఫీ ఇస్తామన్నారు. రైతులకే కాదు.. రైతు కూలీలను ఆదుకునే పథకాలు మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోదాలిస్తామని తెలిపారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర ప్రధాన భూమిక పోషించబోతోందని అన్నారు. పారిశ్రామికంగా మధిర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న టీడీపీ, సీపీఐ పార్టీలకు ధన్యవాదాలు అన్నారు. ప్రజలకు మేం గాలి మాటలు చెప్పడం లేదు.. సంతకాలతో కూడిన గ్యారెంటీ కార్డు ఇస్తున్నామన్నారు. విభజన తర్వాత తెలంగాణకు వచ్చిన సంపద అంతా దొరల దగ్గరికే వెళ్లిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పేదలు పేదలుగానే మిగిలిపోయారు.. అలిసిపోయారన్నారు. నిరుద్యోగులు.. నిరుద్యోగులుగానే మిగిలిపోయారని తెలిపారు. దొరలపై పేదలు గెలవాలన్నారు. పేదలు గెలవాలంటే కాంగ్రెస్ గెలవడమే అని తెలిపారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. విద్యార్థుల కోసం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని తెలిపారు. విద్యార్థినులకు బ్యాటరీ స్కూటర్ పంపిణీ చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకుందామని భట్టి తెలిపారు.
0 Comments