- భారీ టర్నోవర్ నుంచి సడెన్గా ‘జీరో’ ఆదాయం !
- నిధుల మళ్ళింపుపై పలు అనుమానాలు !
- పన్ను ఎగవేత కోసమేనా ?
ఏడాదిలోనే మాయమైన రూ. 20 కోట్ల టర్నోవర్ !
ఈ
సంస్థ సమర్పించిన ఫారం-8 (Form-8) నివేదికల ప్రకారం, 2021-22 ఆర్థిక
సంవత్సరంలో అంకుర హాస్పిటల్ ఉప్పల్ ఎల్.ఎల్.పి. ఏకంగా రూ. 20.78 కోట్ల నికర
టర్నోవర్ను నమోదు చేసింది. అయితే, ఆశ్చర్యకరంగా ఆ తర్వాతి ఏడాది అంటే
2022-23 నాటికి ఈ ఆదాయం ఒక్కసారిగా ‘సున్నా’(0)కు పడిపోయింది. విజయవంతంగా
నడుస్తున్న ఒక ఆసుపత్రి ఏడాది వ్యవధిలో రూపాయి కూడా ఆదాయం లేకుండా ఎలా
మారిందనేది పలు సందేహాలకు తావిస్తోంది. కానీ అదే సమయంలో సంస్థలో 80 లక్షలకు
పైగా నగదు, 1.4 కోట్లకు పైగా లోన్స్ & అడ్వాన్స్లు, రూ. 2 కోట్లకు
పైగా అప్పులు ఉన్నట్లు పత్రాలు చెబుతున్నాయి. అసలు వ్యాపారమే లేకపోతే ఈ
డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పుడు ఆదాయపు
పన్ను శాఖ మరియు రెగ్యులేటరీ సంస్థల ముందున్న అతిపెద్ద ప్రశ్న.
నిధుల మళ్లింపుపై అనుమానాలు
సంస్థ
ఆర్థిక స్థితిగతుల్లో మరో కీలకమైన అంశం ‘ఆస్తుల తగ్గింపు’ (Asset
Liquidation). 2021-22లో సంస్థ వద్ద రూ. 7.09 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా,
2022-23 నాటికి అవి రూ. 2.30 కోట్లకు పడిపోయాయి. అంతేకాకుండా, 2025 మార్చి
నాటి నివేదిక ప్రకారం, సంస్థ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ (Fixed Assets)
విలువ ‘సున్నా’ గా చూపబడింది. ఈ మధ్య కాలంలో ఆస్తులు అమ్మిన రికార్డు లేదు,
బదిలీ వివరాలు లేవు, క్యాపిటల్ గెయిన్స్ ఎక్కడా చూపలేదు. ఆదాయం లేకపోయినా,
భాగస్వాముల ఖాతాలకు నిధులను బదిలీ చేయడం ద్వారా సంస్థను ఆర్థికంగా ఖాళీ
చేసే ఉద్ధేశ్యంతోనే చేస్తున్నట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో స్పష్టమవుతోంది.
చట్టపరమైన ఉల్లంఘనలు మరియు తప్పుడు సమాచారం
ఈ
సంస్థ సమర్పించిన పత్రాలలో చట్టపరమైన లోపాలు కూడా స్పష్టంగా
కనిపిస్తున్నాయి. టర్నోవర్ రూ. 40 లక్షలు దాటలేదని సంస్థ డిక్లరేషన్
ఇచ్చింది. కానీ, వాస్తవ గణాంకాలు మాత్రం రూ. 20 కోట్లకు పైగా ఆదాయాన్ని
చూపిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి ఉద్ధేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం
ఇవ్వడమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఒక సంవత్సరం
రూ. 25 లక్షలకుపైగా కస్టమర్ల నుండి అడ్వాన్స్లు తీసుకున్నట్లు చూపగా,
తరువాత సంవత్సరాల్లో పూర్తిగా మాయం చేశారు. దీనిని ఆదాయంగా చూపించారా ? లేక
తిరిగి ఇచ్చేశారా అనే వివరాలు ఎక్కడ పొందుపరచలేదు. కంపెనీ సెక్రటరీ
ధృవీకరణ పత్రాలలో కూడా హోదా విషయంలో (Fellow vs Associate) పొంతన లేని
సమాచారం పొందుపరిచారు.
ఖర్చులు లేవు... ఉద్యోగులు లేరు... కానీ డబ్బు ఉంది
2024--25లో
జీతాలు సున్నాగా నమోదు చేశారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు సున్నా,
ఇతర ఖర్చులు సున్నాగా చూపించారు. కానీ కోట్లలో నగదు, అడ్వాన్స్లు ఉన్నాయి.
ఈ చర్యలను బట్టి గమనిస్తే దీనిని మేనేజ్మెంట్ షెల్ కంపెనీగా
ఉపయోగిస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతోంది.
దర్యాప్తు కోరుతున్న పౌరసమాజం !
కోట్లాది రూపాయల టర్నోవర్ కలిగిన ఒక వైద్య సంస్థ, అకస్మాత్తుగా కార్యకలాపాలు నిలిపివేసి, ఆస్తులను తగ్గించుకోవడం వెనుక భారీ పన్ను ఎగవేత లేదా నిధుల మళ్లింపు కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. విద్యా మరియు వైద్య రంగాలలో కార్పొరేట్ శక్తుల ఆగడాలను ప్రశ్నించే బాధ్యతాయుతమైన పౌర సమాజం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

0 Comments