Ticker

6/recent/ticker-posts

Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !

ఎట్టకేలకు అక్రమంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. గత మూడేళ్లుగా కొత్తగూడెం పరిధిలోని చుంచుపల్లి తండాలో ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నప్పటికీ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. ఆ క్యాంపస్‌లో చదువుకుంటున్న విద్యార్థులను ఇతర శ్రీ చైతన్య బ్రాంచ్‌లకు వాహనాల్లో తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదేం పద్ధతని విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందిని నిలదీశారు.

మూడేళ్ళుగా నిర్వహణ, పట్టించుకోని విద్యాశాఖ అధికారులు..

ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఇష్టమొచ్చినట్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా విద్యాసంస్థలను నెలకొల్పుతున్నారు. చుంచుపల్లి మండలంలోని నందా తండాలో అక్రమంగా మూడేళ్ల నుంచి శ్రీ చైతన్య పాఠశాల పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి దాకా చూసిచూడనట్టు వ్యవహరించిన విద్యాశాఖ అధికారులు విద్యాసంవత్సరం ప్రారంభమయ్యి 3 నెలల తర్వాత సీజ్‌ చేయటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంతో విద్యాశాఖ అధికారులకు  ఇప్పటి దాకా నడిచిన చీకటి ఒప్పందాల కారణంగానే చూసి చూడనట్టు వదిలేసి, ఇప్పుడు ఒప్పదాలు బెడిసికొట్టేసరికి చర్యలు తీసుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పర్మిషన్‌ లేని శ్రీచైతన్య సంస్థలపై చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు..

శ్రీచైతన్య స్కూల్‌లో చేరితే మీ పిల్లలకి ఐఐటీ కోర్సులు నేర్పిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి మాయమాటలు చెప్పి ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలలో చేర్పించుకుంటారు. ఎన్నో ఆశలతో తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని, వేలకు వేలు ఫీజులు కట్టి తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పిస్తారు. కానీ ఆ పాఠశాలకు పర్మిషన్లు ఉన్నాయా, అర్హత కలిగిన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారా అని మాత్రం ముందుగానే చెక్‌ చేసుకోవడం లేదు. ఫలితంగానే శ్రీ చైతన్య లాంటి అక్రమ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి, తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. అర్ధాంతరంగా విద్యాశాఖ అధికారులు పాఠశాలను సీజ్‌ చేసే సరికి విద్యార్థుల తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. శ్రీ చైతన్య యాజమాన్యం ఇంత మోసం చేస్తారని ఊహించలేదని వాపోతున్నారు. విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్లనే ఇటువంటి అక్రమ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

Post a Comment

0 Comments

Popular Posts

Fake Ayurvendam Doctor : కాంపౌండర్ డాక్టర్‌గా మారితే !
Fake Ayurvedic Doctor : పట్టీల నాగరాజు కాదు...దోపిడీ కాట్‌రాజ్ !
Resonance : రెజొనెన్స్‌ బరితెగింపు !
anasuya-talks-about-war-with-vijay : ఇంతటితో ముగించాలనుకుంటున్నా - అనసూయ
Digital India Bill : సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ ఇండియా బిల్లు !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
ALLEN : అలెన్‌ పేరుతో అక్షర మార్క్‌ దందా !
Vijaya SaiReddy Tweet on Nellore Narayana : నెల్లూరు నారాయణ వేధింపుల పర్వంపై విజయసాయి ట్వీట్‌ !
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !