శ్రీచైతన్యలో చదివే ప్రతి విద్యార్థి విజేత కాలేడు
ప్రతి ఆవిష్కరణ వెనుక ఎందరో త్యాగాలు ఉన్నట్టే, కొందరి విజయాల వెనుక ఎన్నో దారుణ పరాజయాలు దాగి ఉంటాయి. వాటిని గమనిస్తేనే అర్థం అవుతుంది. అందుకు ఉదాహరణే శ్రీచైతన్య జెఈఈ మెయిన్ ర్యాంకులు. జెఈఈ మెయిన్లో ఒకటి, రెండు, రెండు, మూడు, మూడు...10 లోపు 2, 100 లోపు 23 ర్యాంకులు ఒక్క శ్రీచైతన్యవే. ఆలిండియా నెం. 1 శ్రీచైతన్యే. పదే పదే టి.వీ ప్రకటనల్లో ఊదరగొట్టారు. కొంపతీపి ఈ ప్రకటనలో చెప్పినవన్నీ నిజమే అని నేమ్మశారా ? మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు చేసే మాయాజాలం అటువంటిది. నమ్మించటంలో వారికి వారే సాటి. కానీ ఇదే ప్రకటన శ్రీచైతన్య ఉత్తరాది రాష్ట్రాల్లో వేయగలదా ? అంటే లేదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి జిమ్మిక్కులు నడవవు. అక్కడ శ్రీచైతన్య కేవలం ఓపెన్ కేటగిరీ ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తుంది. కావాలంటే శ్రీచైతన్య వెబ్సైట్లోని రిజల్ట్స్ పేజీని పరిశీలిస్తే మీకే అర్థం అవుతుంది. అదే తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి అన్ని కేటగిరీ ర్యాంకులు కలిపి ప్రకటిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో శ్రీచైతన్య చెప్పిందే వేదం. శ్రీచైతన్య ఏది చెబితే అదే కరెక్ట్ అని నమ్మే అమాయక తల్లిదర్రడులు ఉన్నారు కాబట్టే మోసం చేయటం ఈజీ అవుతోంది. అసలు 100 లోపు ఇన్ని ర్యాంకులు ఒకే సంస్థకు ఎలా సాధ్యమవుతున్నాయి అనేది అర్థం కాక సామాన్యులు సైతం విస్తుపోవటం కనిపిస్తుంది.
లెక్కలోకి తీసుకోవలసింది ఓపెన్ కేటగిరీ ర్యాంకులు
అసలు విషయం ఏమిటంటే జెఈఈ మెయిన్లో లెక్కలోకి తీసుకోవలసింది ఓపెన్ కేటగిరీ ర్యాంకులు మాత్రమే. అన్ని కేటగిరీ ర్యాంకులు ప్రకటించి ప్రజల్ని కన్యూజ్ చేసి అందరికంటే ఎక్కువ ర్యాంకులు వచ్చాయి అని భ్రమింపజేసి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేయటం దశాబ్దాలుగా కొనసాగుతోంది. జెఈఈ మెయిన్ 2023 లో దేశవ్యాప్తంగా 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష వ్రాయగా వారిలో 2.5 లక్షల మంది విద్యార్థులు ఒక్క శ్రీచైతన్య విద్యాసంస్థల నుండి మాత్రమే రాశారు. కానీ ర్యాంకులు సాధించిన విద్యార్థులు 30000 మంది. మిగిలిన 2,20,000 మంది భవిష్యత్తు ఏంటి ? ఈ 30000 వేల మంది జెఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ వ్రాయగా వచ్చిన ర్యాంకులు 3621. ఇది శ్రీచైతన్య ప్రకటనలోని ర్యాంకులే. అలాగే నీట్ 2023లో శ్రీచైతన్యలో చదివిన విద్యార్థుల సంఖ్య దాదాపు 54000 మంది, శ్రీచైతన్య సగర్వంగా ప్రకటించిన ర్యాంకులు 8793, శ్రీచైతన్యలోనే చదివి మిగిలిన 45000 మంది మెడికల్ ర్యాంకులు సాధించలేని వారి పరిస్థితి ఏంటి ? వీరందరూ సాధారణ బీటెక్ లేదా డిగ్రీలలో చేరటం తప్పించి మరో గత్యతరం లేదు. శ్రీచైతన్యలో చదివిన వారందరూ ఐఐటియన్లు, డాక్టర్లు ఎందుకు కాలేకపోతున్నారు ? దీనికి శ్రీచైతన్య యాజమాన్యం సమాధానం చెప్పగలదా ? ఈ పరిణామాలను గమనిస్తే మనకి తెలుస్తుంది ఏమిటంటే శ్రీచైతన్యలో చదివిన ప్రతి ఒక్కరూ విజతేలు కాలేరు అని సుస్పష్టం. అలాంటప్పుడు ఎక్కడ చదివినా ఒక్కటే కదా.
తీవ్రమైన ఫ్యాకల్టీ కొరత.
కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటుగా అన్ని చోట్లా తగినంత బోధనా సిబ్బంది అందుబాటులో లేకపోవడం అతి పెద్ద సమస్యగా పరిణమించిందని కాలేజీ యాజమాన్యాలే అభిప్రాయపడుతున్నాయి. ఒకప్పుడు కాలేజీలో ఎన్ని సెక్షన్లు ఉన్నా బోధించే వారి నాణ్యతలో పెద్ద వైరుధ్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందుకు భిన్నం. కాస్త మెరుగ్గా పాఠాలు చెప్పగలిగే వారితో టాపర్స్ సెక్షన్లకు చెప్పిస్తున్నారు. మిగిలిన సెక్షన్లకు బోధించేందుకు తగిన సిబ్బంది దొరకడం లేదు. దాంతో అనుభవం లేని, సబ్జెక్టుపై తగినంత అవగాహన లేని , బోధనా నైపుణ్యం లేని సిబ్బందితో పెద్ద పెద్ద సంస్థలు కూడా నెట్టుకొస్తున్నాయి. దాని ప్రభావం ఈ ర్యాంకుల మీద కనిపిస్తోంది. మంచి ఫ్యాకల్టీ ఉన్న క్లాసుల్లో విద్యార్థులు ముందంజవేస్తున్నారు. మిగిలిన వారు వెనుకబడిపోతున్నారు. భారీ జీతాలు ఆఫర్ చేసినా, బోధనా సిబ్బంది అవసరాల మేరకు లభించకపోవటం పెద్ద సమస్యగా మారుతోందని, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని సంస్థల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న కార్పొరేట్ కాలేజీల్లో ఎలాంటి ఫ్యాకల్టీ ఉందో తల్లిదండ్రులు, సామాజిక వేత్తలు ఆలోచించవలసిన అవసరం ఉంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కాలేజీల్లో అధ్యాపకుల లేమితో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. మొత్తం ఎంత మంది చదివారు, ఎంత మంది ర్యాంకులు సాధించారు అన్న విషయం చెప్పకుండా 10 లోపు, 100 లోపు ర్యాంకులంటూ తల్లిదండ్రుల్ని, ప్రజల్ని మభ్యపెడుతున్నాయి శ్రీచైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలు. బ్రాంచీల వారీగా లెక్కలు తీస్తే 80% పైగా బ్రాంచీలలో ర్యాంకులే రావటం లేదు. 10 లోపు, 100 లోపు ర్యాంకులు చూపించి తల్లిదండ్రుల్ని మోసగిస్తున్నాయి.
టాప్ ర్యాంకులే ఎర !
10 లోపు 2 ర్యాంకులు, 100 లోపు 23 ర్యాంకులు అని విద్యాసంస్థలు ప్రకటిస్తుంటే...ఏ మాత్రం ఆలోచించకుండా పిల్లల్ని ఆయా కార్పొరేట్ సంస్థల్లో వారి అడిగినంత ఫీజు కట్టి తమ పిల్లల్ని బలవంతంగా అక్కడే చేర్చుతుండటం తల్లిదండ్రులకు పరిపాటిగా మారిపోయింది. మార్కులు, ర్యాంకుల మాయలో పడిపోయిన తల్లిదండ్రులు తమ పిల్లలు సైతం టాప్ ర్యాంకులు సాధిస్తారనే భ్రమలోనే శ్రీచైతన్యలాంటి సంస్థల్లో చేర్చుతున్నారు. సమయం గడిచే కొద్ది తత్వం బోధపడుతుంది. రెండేళ్ళ తర్వాత అసలు విషయం బయటపడుతుంది. శ్రీచైతన్యలో చేరితే ర్యాంకు రాదు, స్వతహాగా ప్రతిభావంతుడైతేనే ర్యాంకు వస్తుందని తెలుస్తుంది. అప్పుడు మోసం పోయామని అర్థం అవుతుంది. ఏమి చేయాలో తెలియక, ఎవరిని అడగాలో అర్థం కాక తల్లిదండ్రులు మిన్నకుండిపోతున్నారు. శ్రీచైతన్యలో చేర్పిస్తే ఎందుకు చదవలేదని తమ పిల్లల్ని నిందించే తల్లిదండ్రుల్ని చూస్తూనే ఉన్నాం. మీరు అదే తప్పు చేస్తేన్నారా ? ఇకనైనా తెలివిగా ఆలోచిచండి, మోసం పోవటం మానేయండి. ఇక్కడ ఒక విషయం నిశితంగా గమనించండి. శ్రీచైతన్యకు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా వందాలాది బ్రాంచీలు ఉన్నాయి. వాటిల్లో 10 లేదా 20 బ్రాంచీల నుండి మాత్రమే ఒకటో రెండో ర్యాంకులు వస్తున్నాయి. అసలు ప్రతి బ్రాంచ్కి ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఆ బ్రాంచ్ ఫలితాలు అక్కడే ప్రకటించుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రం అంతటా ఆయా ర్యాంకులు ప్రకటిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవకపోవటం చూస్తూనే ఉన్నాం. మిగిలిన బ్రాంచీల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కానీ టాప్ 10 ర్యాంకులే అన్నీ బ్రాంచీలలో ప్రచురించి పి.ఆర్.ఓ లతో మార్కెటింగ్ చేసుకుంటూ అడ్మిషన్లు చేసుకోవటం, కోట్లాది రూపాయలు
ప్రోగ్రామ్లు కాదు...ఫీజు దోపిడీకి మార్గాలు !
విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి బ్యాచ్లుగా విడగొట్టి క్లాసులు నిర్వహించటం ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్యఉద్ధేశ్యం. ఏ ప్రోగ్రామ్కైనా ఒకే సిలబస్ ఉంటుంది. అందరికీ అదే సిలబస్ అన్నీ చోట్ల బోధిస్తారు. కానీ కొన్ని కార్పొరేట్ కాలేజీలు అఛీవర్స్ ప్రోగ్రామ్, సూపర్ 60 ప్రోగ్రామ్, సి`120 ప్రోగ్రామ్, ఐపిఎల్`ఐసి ప్రోగ్రామ్ అని ఎందుకో పెడుతున్నారో ఎవరికీ అర్థం కాదు, ఫీజులు దండుకోవటం కోసం కార్పొరేట్ కాలేజీలు కనిపెట్టిన నయా దోపిడీ మార్గం ఈ ప్రోగ్రామ్స్. తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని మభ్యపేట్టే మాయ చేసి ఎక్కువ ఫీజులు వసూలు చేయటం ఈ ప్రోగ్రామ్స్ లక్ష్యం. ఎక్కువ ఫీజు కడితే చదువు బాగా చెప్తారేమో, మా పిల్లాడికి ర్యాంకు వస్తుందేమో అన్న ఆశతో ముందు వెనుక చూడకుండా కార్పొరేట్ కాలేజీల్లో చేర్చుతున్నారు. ప్రోగ్రామ్ పేరుతో ఎక్కువ ఫీజు వసూలు చేసే ఏ కాలేజీ అయినా ర్యాంకు గ్యారెంటీ ఇవ్వగలదా ? అంటే లేదనే చెప్పాలి. ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ అంటూ వారంలో ఒక పరీక్ష, రోజూ ఓ పరీక్ష నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురిచేయటం ప్రోగ్రామ్స్ యొక్క దుష్పరిణామాలు. ఒత్తిడిని గెలిచిన వారు విజేతగా నిలుస్తున్నారు. ఒత్తిడి తట్టుకోలేని వారు పోటీలో వెనుకబడిపోతుంటారు.
0 Comments