Ticker

6/recent/ticker-posts

Priya ponguru comments on Narayana : ప్రియ పొంగూరుతో విడాకుల కోసం 150 కోట్లు భరణం చెల్లించేందుకు సిద్ధమైన నారాయణ ఫ్యామిలీ ?

  • లైంగిక వేధింపుల నేపథ్యంలో పెరుగుతున్న అనుమానాలు !
  • ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన !
  • విడాకుల కోసం రూ 150 కోట్లు భరణం చెల్లించేందుక సిద్ధమైన నారాయణ ఫ్యామిలీ 

నారాయణలో పనిచేసే మహిళలకి, చదువుకునే బాలికలకి, ఆఖరికి సేవచేసే డాక్టర్లకి సైతం లైగింక వేధింపులు తప్పటం లేదు. ఇకనైనా మన మహిళలను, ఆడువారిని కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నారు నారాయణ పశ్చిమ బెంగాల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రియ పొంగూరు. సొంత కుటుంబసభ్యురాలైన తనపైపే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటే నారాయణ కాలేజీల్లో పనిచేసే మహిళల మీద, ఉద్యోగుల మీద ఇంకా ఏస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. నారాయణలో ఆడవాళ్ళకి ఏమాత్రం రక్షణ లేదు. ఉద్యోగుల మీద, విద్యార్థులను మీద, డాక్టర్ల మీద అన్ని చోట్ల వేధింపులకు గురి చేయటం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకుంటే నారాయణ తమ్ముడి భార్యనైెనా లైంగికంగా లొంగిపోనందుకు 29 సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారన్నారు.  నారాయణ వైద్యశాలలో చాలామంది మహిళా వైద్యులు మాజీ మంత్రి నారాయణ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారని, కొందరు తప్పక లొంగిపోయేవారని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లుగా పేర్కొన్నారు. కాలేజీల్లో పనిచేసే మహిళలనే కాదు, మెడికల్‌ కాలేజీలోని లేడీ డాక్టర్స్‌ పెళ్ళి చేసుకుంటా అని మభ్యపెట్టటం, ఒప్పుకోకపోతే నిందలు వేయటం, ఆమెపై తప్పుడు ప్రచారం చేయటం, అలా హాస్పిటల్స్‌ ను వదిలి వెళ్ళపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందన్నారు. ఎంతో మందిని లైంగికంగా వాడుకున్నారని తెలిపారు. అలాంటి నీచుడి పైశాచిక చరిత్రను ప్రపంచం ముందు దోషిగా నిలిపాలనే ఉధ్దేశ్యంతోనే వరుస వీడియోలను విడుదల చేసినట్లు తెలుస్తోంది. దానికి నారాయణ రెండో భార్యగా చలామణివుతున్న ఇందిర అన్ని ఏర్పాట్లు చేస్తారని సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ మెడికల్‌ కాలేజీ మరియు ఇంజినీరింగ్‌ కళాశాల్లోని అమ్మాయిల ఆత్మహత్యలు, నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఇప్పుడు పలు సందేహాలు మెలకెత్తుతున్నాయి. ఇలాంటి కేసులపై సి.బి.ఐ. ద్వారా దర్యాప్తు చేస్తేకానీ అసలు నిజాలు బయటికొస్తాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 

అన్నీ ఆ తాను ముక్కలే ! 

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. అదే తరహాలోనారాయణ స్టాఫ్‌ కూడా ఆయన బాటలోనే నడుచుకున్నారు. అందుకు ఉదాహరణే 2016లో అశోక్‌నగర్‌లోని నారాయణ స్కూల్‌లో జరిగిన ఉదంతం. మాజీ ప్రిన్సిపాల్‌ శ్రీలత అనే టీచర్‌తో సహా పలువురు మహిళా సిబ్బందిపై డీన్‌ జయసింహారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఆ విషయం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ప్రిన్సిపాల్‌, డీన్‌ వేధింపుల వల్లే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని నారాయణ సిబ్బందే స్వయంగా ఫోన్‌ సంభాషణల్లో మాట్లాడుకోవటం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు తన క్రింద ఉన్న మహిళలతో శారీరకంగా లోబరుచుకోవడానికి వృత్తిపరమైన ఒత్తిడికి గురిచేసి, ఆ తర్వాత అశక్తతను ఆసరా చేసుకుని లోబరుచుకోవటం లేదంటే సంస్థను వదిలిపోయేలా చేయటం జరుగుతుంది. శిరీష అనే మహిళ మాట్లాడుతూ.. ‘నేను 2013లో నారాయణ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేశాను. ఆ సమయంలో చాలా మంది నన్ను వేధించేవాళ్లు, నాతో అనుచితంగా ప్రవర్తించేవారు. నా పై అధికారి పేరు కృష్ణారెడ్డి. కూడా పాలుపంచుకున్నారు. వారు నన్ను మానసికంగా కలవరపరిచారు, దాని తర్వాత నేను ఫిర్యాదు దాఖలు చేసి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాను.’’‘‘వాళ్ళను మందలించే బదులు, కేసు పెట్టినందుకు నన్ను తొలగించారు. కృష్ణా రెడ్డి ఇప్పటికీ అదే స్థలంలో పనిచేస్తున్నాడు. అతనే కాదు, ఆ ఇన్స్టిట్యూట్‌లో చాలా మంది ఉన్నారు’’ అని ఆమె తెలిపింది. ఈ సంఘటన ప్రియ పొంగూరు చెప్పిన సంఘటనలో అచ్చుగుద్దినట్లు పొలిఉండటం విశేషం. 

రూ. 150 కోట్ల భరణం చెల్లించేందుకు నారాయణ ఫ్యామిలీ రాయబారం !

క్యాన్సర్‌తో బాధపడుతున్నా, తన పిల్లల భవిష్యత్తుపై ప్రభావం ఒక నీచుడి చీకటి కోణాన్ని బయటపెట్టేందుకు ప్రియ పొంగూరు చేసిన సాహసం ఎంతో అభినందనీయమని ప్రజలు కొనియాడుతున్నారు. సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రియ పొంగూరుకు మద్దతు లభిస్తోంది. సైబరాబాద్‌ పరిధిలోని పోలీస్‌ కంప్లైంట్‌పై ఎవరు చర్యలు తీసుకోని నేపథ్యంలో నెల్లూరు లేక గుంటూరులోని పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తే ప్రియ పొంగూరుకు న్యాయం జరుగుతోందని సోషల్‌ మీడియా వేదిక మేసేజ్‌లతో హోరెత్తిపోతుంది. చుద్దాం ప్రియ పొంగూరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. లైంగిక ఆరోపణలు చేసిన పేపథ్యంలో ప్రియ పొంగూరుకు వదిలించుకునేందుకు నారాయణ మరియు ఆమె భర్త పొంగూరు మణి మరో పెద్ద మనుషులతో మద్యవర్తిత్వం నడుపుతున్నారు. 150 కోట్లు భరణంగా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తక్షణ సాయంగా రూ. 50 కోట్లు సమకూర్చు మిగతావి విడతల వారీగా ఇచ్చేందుకు మాటలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తన జీవితాన్ని పణంగా పెట్టి నారాయణ చీకటి కోణాన్ని బయటపెట్టిన ధీరవనిత ప్రియ పొంగూరు ఈ మధ్య కాలంగా సంచలనం సృష్టించారు. 

Post a Comment

0 Comments

Popular Posts

JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
Digital India Bill : సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ ఇండియా బిల్లు !
amitshah Comments 2g-3g-4g parties : కాంగ్రెస్‌, డీఎంకేలు తరాలుగా అవినీతిని కొనసాగిస్తున్నాయి
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
corporate colleges gimmicks in neet results : ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులు !
 Vizag MP Family Kidnap : విశాఖలో రెచ్చిపోయిన కిడ్నాపర్లు ! ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు !
anasuya-talks-about-war-with-vijay : ఇంతటితో ముగించాలనుకుంటున్నా - అనసూయ