నారాయణ విద్యాసంస్థల్లో పిల్లల ఆత్మహత్యలకుకారణాలు తెలియజేస్తా
క్యాన్సర్తో బాధపడుతున్న ప్రియ పొంగూరు చికిత్సకు సైతం డబ్బులు అందకుండా అన్ని మార్గాలు మూసివేసినట్లు పేర్కొన్నారు. తన కుటుంబ ఆస్తులు అమ్మి చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నారాయణ విద్యాసంస్థల్లో పిల్లల ఆత్మహత్యలకు కారణాలను త్వరలోనే బయటపెడతానన్నారు. కుటుంబంలో జరిగే విషయాలను ప్రపంచానికి తెలియకుండా ఇప్పటి వరకు తన నోరు కట్టేశారన్నారు, కానీ ఇప్పుడు నన్ను ఎవరు మాట్లాడకుండా ఆపలేరనన్నారు. ఈ రోజు కూడా గంటా శ్రీనివాసరావు గారితో రాయబారం పంపారు. ఆయన మీటింగ్ వలన ఒరిగిందేమీ లేదని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడిరచారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో వైరల్గా మారింది. నారాయణ తమ్ముడి పేరు మణి.. ఆయన భార్యపేరు ప్రియ. వీరు ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో టీడీపీ నేత నారాయణపై ఇలాంటి ఆరోపణలు తెరపైకి రావడంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఇప్పటి వరకు చేయని ఆరోపణలు ఏపీలో ఎన్నికలు జరగబోతున్న సమయంలోనే ఎందుకు చేశారు.. దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అని టీడీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
0 Comments