భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున ఆరోపించారు. రూ.20కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడారు. ‘‘ఈటలను చంపేస్తామంటే మేం భయపడిపోం. కౌశిక్ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్ ఉన్నారు. ఓటుతోనే ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్తారు. కౌశిక్ రెడ్డిని.. కేసీఆర్ హుజూరాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. అమరవీరుల స్తూపాన్ని కౌశిక్రెడ్డి కూలగొట్టించారు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి కేసీఆరే కారణం’’ అని జమున ఆరోపించారు.
0 Comments