Ticker

6/recent/ticker-posts

Srichaitanya : శ్రీచైతన్య స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు ర్యాంకులు రావా ?

మాదాపూర్‌ సిఓ ఐఐటి స్కూల్స్‌లో చదివిన వారికే ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు వస్తాయా ? కావాలంటే శ్రీచైతన్య ప్రకటన ఒకసారి చూడండి, గమనించండి. శ్రీచైతన్య స్వయంగా తమ ప్రకటనలో చెప్పినదే మీ ముందు ఉంచుతున్నాం. జెఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ మరియు నీట్‌ పోటీపరీక్షల్లో కనీవీనీ ఎరుగని రీతిలో హ్యాట్రిక్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులూ శ్రీచైతన్య సిఓ ఐఐటి స్కూల్‌ విద్యార్థులు కావటం గమనార్హం. అంటే మాదాపూర్‌ సిఓ ఐఐటి స్కూల్స్‌లో చదివినే విద్యార్థులకే ర్యాంకులు వచ్చాయి అని శ్రీచైతన్య ప్రకటన ద్వారా తెలియజేస్తోంది. మాదాపూర్‌ సిఓ ఐఐటి స్కూల్స్‌ ఉన్నవే రెండు బ్రాంచీలు. అక్కడ నుండే ర్యాంకులు వచ్చాయి అంటే దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌ నుండి మిగతా బ్రాంచీల నుండి ర్యాంకులు రాలేదు అని చెప్పటం వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

ర్యాంకులు చూసి మోసపోకండి !

మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అందిస్తాం అంటూ నాలుగు ర్యాంకులు చూపిస్తే చాలు వారిని గుడ్డిగా నమ్మే స్థితిలో ఉన్నారు నేటి తల్లిదండ్రులు. అదే ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకోలేని ఓ సందిగ్థావస్థలో ఉన్నారు. తల్లిదండ్రుల అమయకత్వాన్ని ఆసరా చేసుకుని అడ్మిషన్లు దండుకునే పనిలో ఉంది శ్రీచైతన్య. ర్యాంకు వచ్చే విద్యార్థి దగ్గర అదే ఫీజు తీసుకుంటున్నారు, ర్యాంకులు రాని విద్యార్థుల దగ్గర అదే ఫీజులు తీసుకుంటున్నారు కదా, మరి మీరు అడిగినంత ఫీజులు చెల్లిస్తాం అదే ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధింపజేస్తారా ? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే..గ్యారెంటీ ఇచ్చే వాళ్ళు ఒక్కరంటే ఒక్కరూ ఉన్నారా ? అంటే... మీ పిల్లాడు బాగా చదివితే ర్యాంకు వస్తుంది, మేము గైడెన్స్‌ మాత్రమే ఇస్తాం అని చేతులు దులుపుకుంటున్నారు.  దేశవ్యాప్తంగా జెఈఈ మెయిన్‌ 2023 లో దేశవ్యాప్తంగా 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష వ్రాయగా వారిలో 2.5 లక్షల మంది విద్యార్థులు ఒక్క శ్రీచైతన్య విద్యాసంస్థల నుండి మాత్రమే రాశారు. కానీ ర్యాంకులు సాధించిన విద్యార్థులు 30000 మంది. మిగిలిన 2,20,000 మంది భవిష్యత్తు ఏంటి ? ఈ 30000 వేల మంది జెఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌ వ్రాయగా వచ్చిన ర్యాంకులు 3621. ఇది శ్రీచైతన్య ప్రకటనలోని ర్యాంకులే. అలాగే నీట్‌ 2023లో శ్రీచైతన్యలో చదివిన విద్యార్థుల సంఖ్య దాదాపు 54000 మంది, శ్రీచైతన్య సగర్వంగా ప్రకటించిన ర్యాంకులు 8793, శ్రీచైతన్యలోనే చదివి మిగిలిన 45000 మంది మెడికల్‌ ర్యాంకులు సాధించలేని వారి పరిస్థితి ఏంటి ? దీనిని బట్టి ఏమి అర్థం అవుతుంది అంటే స్వతహాగా ప్రతిభావంతులకే ర్యాంకులు వస్తాయి. విద్యార్థులు చదివితేనే ర్యాంకులు వస్తాయి, శ్రీచైతన్య చెబితే కాదు అన్న విషయం గ్రహించాలి. ఒకవేళ శ్రీచైతన్య టీచింగ్‌ అంత గొప్పదైతే...శ్రీచైతన్యలో చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఒకటో ర్యాంకు ఎందుకు రావటం లేదో. సమాధానం చెప్పగలరా ?

విద్యార్థిపై తీవ్రమైన ఒత్తిడి !

ఒక నెలలో పూర్తిచేయవలసిన పాఠాలు 5 రోజుల్లో పూర్తి, మూడు నెలల్లో పూర్తి చేయవలసిన పాఠాలు ఒక నెలలో పూర్తి, 6 నెలల్లో పూర్తి చేయవలసిన సిలబస్‌ను 2 నెలల్లో కంప్లీట్‌ చేయటం వివిధ సబ్జెక్టులు ఒకేసారి బ్రెయిన్‌లోకి ఎక్కించే ప్రయత్నం చేయటం, అర్థం అవుతుందో, లేదో తెలుసులేకపోవటం, సబ్జెక్టుల్ని పూర్తి నిర్లక్ష్యం వహించటం, మ్యాథ్స్‌,సైన్స్‌ సబ్జెక్టులకే అధిక ప్రాధాన్యం ఇవ్వటం, రోజువారీ పరీక్షలు, గ్రేడ్‌లు, హోంవర్క్‌, అసైన్‌మెంట్‌లు, అకడమిక్‌ మరియు అచీవ్‌మెంట్‌ అంచనాలు అంటూ ఒక చక్రబంధంలో ఇరికించటం కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి వల్ల డిప్రెషన్‌, యాంగ్జయిటీ, నెర్వస్‌నెస్‌ మరియు స్ట్రెస్‌-సంబంధిత సమస్యలు మీ పిల్లలు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఒత్తిడి భరింత లేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి ఏ ఒక్కరు బాధ్యత తీసుకోవటం లేదు. ఒక్కసారి మీ పిల్లల్ని గమనించండి, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసుకోండి, వారికి సపోర్ట్‌గా నిలవండి.

శ్రీచైతన్య ర్యాంకుల కోసం...బలవుతున్న విద్యార్థులు

రన్నింగ్‌ రేస్‌ లాంటి పోటీప్రపంచంలో అరక్షణం ఏమరపాటుగా ఉన్నా రేసులో వెనక్కిపోయినట్టే. అలా విద్యార్థులు 6 వ తరగతి నుండి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకు కష్టపడి, పోటీప్రపంచంతో పోటీపడి, లక్షలాది మందిని తమ ప్రతిభతో వెనక్కి నెట్టి ర్యాంకు సాధిస్తే వచ్చే సంతోషం కేవలం రెండు రోజులు మాత్రమే. కానీ ఆ ఫలితాలను సంవత్సరమంతా వాడుకునేది మాత్రం శ్రీచైతన్య. కష్టం విద్యార్థులది. ఫలితం మాత్రం శ్రీచైతన్యది. పోనీ ఈ ర్యాంకులు సాధించిన వారందరికీ ఫీజులు లేకుండా అయినా చదువుకునే అవకాశం ఇచ్చారా అంటే అదీ లేదు. లక్షలకు లక్షలు ఫీజు ముక్కుపిండి వసూలు చేసుకున్నారు. విద్యార్థులూ రేయింబవళ్ళు ఎంతో కష్టపడి టాప్‌ ర్యాంకులు సాధించినా లబ్ధి మాత్రం శ్రీచైతన్యకే కలుగుతుంది. మీ పిల్లల ర్యాంకులతో ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, మూడు అంటూ ప్రకటనలు గుప్పిస్తూ లక్షలాది అడ్మిషన్లు దండుకుంటోంది. కోట్లలో లాభాలను ఆర్జిస్తోంది. తల్లిదండ్రులారా మీరు మారండి, ర్యాంకు సాధించిన ప్రతీ తల్లిదండ్రులూ మీ పిల్లల ర్యాంకు వాడుకుంటున్నందుకు మీరు కోట్లలో డిమాండ్‌ చేయండి. అదీ మీ హక్కు. మీ పిల్లాడి కష్టార్జితం.

Post a Comment

0 Comments

Popular Posts

JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
Digital India Bill : సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ ఇండియా బిల్లు !
amitshah Comments 2g-3g-4g parties : కాంగ్రెస్‌, డీఎంకేలు తరాలుగా అవినీతిని కొనసాగిస్తున్నాయి
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
corporate colleges gimmicks in neet results : ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులు !
 Vizag MP Family Kidnap : విశాఖలో రెచ్చిపోయిన కిడ్నాపర్లు ! ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు !
anasuya-talks-about-war-with-vijay : ఇంతటితో ముగించాలనుకుంటున్నా - అనసూయ