Ticker

6/recent/ticker-posts

Srichaitanya Score :శ్రీచైతన్య రూ.1000 కోట్లు స్కాలర్‌షిప్‌ బోగస్సా ?

శ్రీచైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్కోర్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఫలితాలు వెలువడ్డాయి. 15 రోజుల పాటు వివిధ సమయాల్లో స్లాట్‌లు కేటాయించి మరీ నిర్వహించిన స్కోర్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ మరో 15 రోజుల పాటు టైమ్‌ తీసుకుని వెల్లడిరచింది. కానీ స్కాలర్‌షిప్‌ సాధించిన విద్యార్థుల వివరాలు మాత్రం వెల్లడికాలేదు. దీంతో శ్రీచైతన్య స్కోర్‌ స్కాలర్‌షిప్‌ మీద పలు సందేహాలు తలెత్తుతున్నాయి.  అసలు నిజంగా శ్రీచైతన్య రూ. 1000 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ అందిస్తోందా ? అందిస్తే వారి వివరాలు ఎందుకు ప్రకటించటం లేదు ? స్కాలర్‌షిప్‌ ముసుగులో విద్యార్థుల వివరాలు సేకరిస్తుందా ? ఇలాంటి పలు అనుమానాలు తల్లిదండ్రులు లేవనెత్తుతున్నారు. శ్రీచైతన్య విద్యార్థులను మినహాయించి మరీ దేశంలో ఇతర స్కూల్స్‌ మరియు కాలేజీలలో చదివే విద్యార్థులే లక్ష్యంగా శ్రీచైతన్య స్కోర్‌ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ నిర్వహించింది. దేశంలో ఏ చిన్న రిజల్ట్‌ వచ్చినా మీడియాలో హోరేత్తించే శ్రీచైతన్య రూ.1000 కోట్ల స్కాలర్‌షిప్‌ అందిస్తుంటే ఇంకెంత ప్రచారం చేసుకుంటుంది. సరిగ్గా ఇక్కడే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

సోషల్‌ మీడియాలో భారీ ప్రచారం   

పరీక్షకు కొద్ది నెలలు ముందు నుండే సోషల్‌ మీడియా వేదికగా ఇన్ఫినిటి లెర్న్‌, శ్రీచైతన్య, నాలెడ్జ్‌ హబ్‌ ద్వారా భారీ ప్రచారం నిర్వహించింది. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను ఈ పరీక్షకు అనర్హులుగా ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా ఇతర స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులే స్కోర్‌ స్కాలర్‌షిప్‌ వ్రాసేలా శ్రీచైతన్య టార్గెట్‌గా పెట్టుకుంది. వారికి రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ అనే గాలం విరిసింది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థుల మెదళ్ళలో ఆశలను రేకెత్తించింది. స్కాలర్‌షిప్‌ వ్రాసేలా పురిగొల్పింది. కానీ శ్రీచైతన్య అసలు ఉద్శేశ్యం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఇతర స్కూల్స్‌ ఉన్న టాలెంటెడ్‌ విద్యార్థుల వివరాలు సేకరించి వారిని శ్రీచైతన్యలోకి చేర్చుకోవడమే వారి అంతమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసంది శ్రీచైతన్య. ఇప్పటికే ఈ స్కోర్‌ ఎగ్జామ్‌లో పాల్గొన్న విద్యార్థుల వివరాలను సేకరించిన శ్రీచైతన్య వచ్చే విద్యాసంవత్సరానికి కల్లా వారందరిలో శ్రీచైతన్య విద్యాసంస్థల్లోలోకి రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.  ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఉచిత విద్యను ఆఫర్‌ చేయటం దగ్గర నుండి భారీ నగదు ఆశచూపటం, ఇతర ప్రయోజనాలు కలిగించేలా ప్రలోభాలకు గురిచేయటం వంటి కార్యక్రమాలతో విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ స్కాలర్‌షిప్‌ వెనుక ఉన్న అసలు సిసలు ఉద్ధేశ్యం. ఎందుకంటే బాగా చదివే విద్యార్థులు రాబోయే రోజల్లో నీట్‌, జెఈఈ అడ్వాన్స్‌డ్‌ లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి.

స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థుల జాబితా ఎందుకు ప్రకటించటం లేదు ?

ఒక్క ర్యాంకు వస్తేనే మీడియాలో నానా హంగామా చేసే శ్రీచైతన్య రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ అందిస్తే...ఇంకెంత ప్రచారం చేసుకుంటుంది. కానీ ఎలాంటి చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా పరీక్ష ఫలితాలను విడుదల చేసింది అంటేనే ఎదో మతలబు దాగి ఉందని అర్థం అవుతుంది. పేరుకే రూ.1000 కోట్ల స్కాలర్‌షిప్‌ ఇచ్చేది మాత్రం అరకొర నగదు బహుమతులే. ఒకసారి గమనించండి, వేరే స్కూల్‌ / కాలేజీలో చదువుతూ శ్రీచైతన్య స్కోర్‌ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ఆ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే శ్రీచైతన్య సంస్థలో అడ్మిషన్‌ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. కావాలనే శ్రీచైతన్య తనకు అనుకూలమైన షరతులు పెట్టుకుంది.  ఎలాగూ కోట్లు రూపాయలు విద్యార్థులకు ఇచ్చే అవకాశం లేదు కనుకనే రూ. 1000 కోట్లు అని పెద్ద మొత్తంలో సంఖ్యను పెట్టి విద్యార్థులకు ఎర వేసింది. చివరికి స్కాలర్‌షిప్‌ అని నమ్మి మోసపోతున్నది విద్యార్థులే. దేశవ్యాప్తంగా ఏఏ స్కూల్స్‌లో / కాలేజీల్లో ప్రతిభావంతులైనా విద్యార్థులు ఉన్నారో గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం కోసమే ఈ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ అని శ్రీచైతన్యలో పనిచేసే వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఎగ్జామ్‌ రాసే ప్రతి స్టూడెంట్‌ దగ్గర నుండి సరాసరిన 150/` వసూలు చేస్తున్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష వ్రాసారని ఓ అంచనా. ఈ లెక్కన సుమారు 10 కోట్ల రూపాయలు ఎగ్జామ్‌ ఫీజుల రూపంలో వసూలు చేసింది శ్రీచైతన్య. ఎగ్జామ్‌ వ్రాసే వరకే శ్రీచైతన్య హడావిడి, ఆ తర్వాత 50 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించి చేతులు దులుపుకుంటుంది. స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థుల వివరాలు ఎక్కడ అనేది అంతా గోప్యంగా ఉంచింది. ఇన్ఫినిటీ లెర్న్‌ వెబ్‌సైట్‌ వెతికినా ఎక్కడ సమాచారం లభించదు. దీంతో శ్రీచైతన్య స్కాలర్‌షిప్‌పై పలు అనుమానాలు కలుగుతున్నాయి.  గత 3 సంవత్సరాలుగా శ్రీచైతన్య నిర్వహించిన స్కోర్‌ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్స్‌లో 1000 కోట్లు ఎంత మంది విద్యార్థులకు అందించిందో పూర్తి వివరాలతో కూడిన సమాచారం తల్లిదండ్రుల ముందు ఎందుకు ఉంచటం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


కొరవడిన నిజాయితీ !

దేశవ్యాప్తంగా ఎవరూ ఎలాంటి పరీక్ష నిర్వహించినా ఫలితాలలను బహిరంగంగా ప్రకటించటం సంప్రదాయం, నిజాయితీకి కొలమానం. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆర్భాటంగా రూ. 1000 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌ నిర్వహించింది, కానీ అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో ఆయా అభ్యర్థులు మాత్రమే చూసుకునేలా గోప్యత పాటిస్తోంది. బాధ్యత గల విద్యాసంస్థగా ఫలితాలను బహిరంగంగా వెల్లడి చేయాల్సి ఉంది. కానీ  ఎందుకు వెల్లడిరచటం లేదు అన్నది పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.  ప్రతి తరగతిలో కేవలం 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి వివిధ స్థాయిల్లో నగదు బహుమతులు మాత్రమే ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నగదు బహుమతుల విలువ 25 లక్షలు లోపే ఉండటం గమనార్హం. ఫలితాల గురించి ఇన్ఫినిటీ లెర్న్‌ ప్రతినిధులను సంప్రదించగా, ఫలితాలు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటు ఉంటాయి, ఆప్‌లైన్‌లో వ్రాసిన వారి వివరాలు ఆయా బ్రాంచీలలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొత్తం ఫలితాలకు సంబంధించిన సమాచారం మా వద్ద లేదు అని తెలియజేశారు. 



Post a Comment

0 Comments

Popular Posts

JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
Digital India Bill : సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ ఇండియా బిల్లు !
amitshah Comments 2g-3g-4g parties : కాంగ్రెస్‌, డీఎంకేలు తరాలుగా అవినీతిని కొనసాగిస్తున్నాయి
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
corporate colleges gimmicks in neet results : ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులు !
 Vizag MP Family Kidnap : విశాఖలో రెచ్చిపోయిన కిడ్నాపర్లు ! ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు !
anasuya-talks-about-war-with-vijay : ఇంతటితో ముగించాలనుకుంటున్నా - అనసూయ